KTR | డిసెంబర్ 9.. ఉద్యమరూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన సందర్భం. ఉద్యమనేత, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నవంబర్ 29, 2009న ఆమరణ దీక్ష ప్రారంభించింది మొదలు 11 రోజులపాటు నలుదిక్కులను ఏకం చేసి కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేయక తప్పని అనివార్యతను సృష్టించిన అజరామర ఘట్టం. ఈ ఘట్టంతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిప్పింది.