ఆగస్టు 12, 2025 న 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని, అవి రోడ్ల మీదికి రాకూడదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, అందులో బీఎస్ 4 వాహనాలు కూడా ఉండటంతో వాటిని మినహాయించి బీఎస్ 3 కి చెందిన 15 ఏళ్లు దాటిన పెట్రోల్, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను వాడటానికి వీలు లేదని తాజాగా ఉత్తర్వలు జారీ అయ్యాయి.